top of page

📱🇨🇳 మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌..

🇨🇳 చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఐక్యూ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఐక్యూ జెడ్‌7 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. ఆగస్టు 31వ తేదీన ఈ ఫోన్‌ భారత్‌లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

🌐 కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఈ కామర్స్‌ సైట్ అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ ధరకు సంబంధించిన ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేకపోయినప్పటికీ భారత్‌లో రూ. 25 నుంచి రూ. 30 వేల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

📸 ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 4ఎన్‌ఎమ్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఐక్యూ జెడ్‌7 ప్రో స్మార్ట్ ఫోన్‌ లేటెస్ట్‌ ఆండ్రాయిడ్ వెర్షన్‌ ఆధారంగా పనిచేస్తుంది.

📷 కెమెరాకు సైతం అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం ఇందులో 16 మెగా పిక్సెల్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 66 వాట్స్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4600 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.

Related Posts

See All

🗣️ లోక్‌సభలో రాహుల్ ప్రసంగం వెనుక స్క్రిప్ట్‌ ప్లే చేసింది ఎవరో తెలుసా..

🗣️లోక్‌సభలో బుధవారం (ఆగస్టు 9) మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page