top of page

🚆 తిరుపతికి టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే ప్లాన్‌..

📅 మొత్తం 3 రాత్రులు, 4 రోజులుగా ఉండే ఈ ప్యాకేజీ ప్రస్తుతం నవంబర్‌ 12, 2023 తేదీన అందుబాటులో ఉండనుంది.

🚂 టూర్‌ ఇలా సాగుతుంది.. 🌆 టూర్‌లో భాగంగా తొలి రోజు లింగంపల్లి నుంచి సాయంత్రం 5.25 గంటలకు రైలు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు తిరుపతికి ఉదయం 5.55 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌లోకి తీసుకెళ్తారు. ఫ్రెష్‌ అప్‌ అయిన తర్వాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాలకు సందర్శించుకుంటారు. అనంతరం శ్రీ కాళహస్తి, తిరుచానూరు ఆలయాన్ని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం హోటల్‌కి తిరిగి వెళ్తారు. రాత్రి తిరుపతిలో బస చేయాల్సి ఉంటుంది.

🌄 మూడో రోజు ఉదయం టిఫిన్‌ చేసిన తర్వాత హోటల్‌ నుంచి చెక్‌ అవుట్‌ అవ్వాలి. అనంతరం తిరుమలలో వెంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం 8.30 గంటలకు తిరుమలకు బయలుదేరాలి. సాయంత్రం 06:25 గంటలకు రైలు ఉంటుంది. అనంతరం తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది. లింగంపల్లికి ఉదయం 6.55 గంటలకు చేరుకుంటారు. దీంతో ఈ టూర్‌ ప్యాకేజీ ముగుస్తుంది.

💰 ప్యాకేజీ ధరలు విషయానికొస్తే.. 🌅 పూర్వ సంధ్య టూర్‌ ప్యాకేజీ ధర విషయానికొస్తే.. స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 7720గా, డబుల్ ఆక్యూపెన్సీ రూ. 5860, ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ.5,660గా ఉంటుంది. కంఫర్ట్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీ ధర రూ.9570, డబుల్ ఆక్యూపెన్సీ రూ. 7720, ట్రిపుల్ ఆక్యూపెన్సీ రూ.7510గా నిర్ణయించారు. ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్లల కోసం వేరు వేరు ధరలు ఉన్నాయి.

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page