top of page
MediaFx

డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..’సాలార్ 2’లో మరో సుందరి


ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. ఈ మూవీ రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్ మొదటి పార్ట్ సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు సలార్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా దాదాపు 700 కోట్ల వరకు వసూల్ చేసింది. విడుదలైన అన్ని భాషల్లో సలార్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు ప్రభాస్ అభిమానులంతా.. సలార్ 2 కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు సలార్ 2 సినిమా మరింత యాక్షన్ తో ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి ఇప్పుడు ఫిలిమ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. సలార్ సినిమాలో శ్రుతిహాసన్ తో పాటు మరో హీరోయిన్ కూడా నటిస్తుందని తెలుస్తోంది.

సలార్ సినిమాలో మరో హీరోయిన్ గా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. సలార్ సెకండ్ పార్ట్ కు శౌర్యాంగ పర్వం అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. దీని పై చిత్రయూనిట్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేశారు. సలార్ 2తో పాటు కల్కి, రాజా సాబ్ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే కల్కి సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈసారి ఖాన్సార్ లో యాక్షన్ సీన్స్ మరింత హై ఓల్టేజ్ లో ఉంటాయని తెలుస్తోంది.


bottom of page