🌍 కేరళలో నిఫా వైరస్ వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ ఐదుమందికి సోకగా.. అందులో ఇద్దరు మృతి చెందారు. 🚨
ఈ నేపథ్యంలోనే భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) హెచ్చరికలు జారీ చేసింది. 🩺 కరోనా వైరస్తో పోల్చితే.. నిఫా వైరస్ అత్యంత ప్రమాదకరమైనదని తేల్చి చెప్పింది. 😷 కొవిడ్ సోకిన వారిలో 2 – 3 శాతం మరణాలు ఉండగా.. నిఫా వైరస్ వల్ల 4–70 శాతం మరణాలు ఉన్నాయని చెప్పింది. ⚠️ ప్రస్తుతం ఐసీఎంఆర్ వద్ద 10 మంది రోగులకు సరిపడేలా మోనోక్లీనల్ యాంటీబాడీ మందు అందుబాటులో ఉంది. 💉 అలాగే మరో 20 డోసుల మందును ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. 💪🌡️
Comments