top of page
MediaFx

అల్లు అర్జున్‏కు పోటీగా వస్తున్న కీర్తి సురేష్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. "నేను శైలజ" చిత్రం తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి, "మహానటి" సినిమాలో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

చివరగా మెగాస్టార్ చిరంజీవి నటించిన "భోళా శంకర్" సినిమాలో కనిపించిన కీర్తి, ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తుంది. అలాగే తమిళంలో "రఘు తాతా" అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న "రఘు తాతా" చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, రాజీవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షాన్ రోల్డన్ సంగీతం అందిస్తుండగా, టీజర్, పోస్టర్లు సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.

తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. కీర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15, 2024న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇదిలా ఉంటే అదే రోజున స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందుతున్న "పుష్ప 2" చిత్రాన్ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో "పుష్ప 2" చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదలైన కపుల్ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతుంది.

bottom of page