top of page

రామ్ చరణ్ సర్‌కి నేను ఫ్యాన్‌ని.. అల్లు అర్జున్‌ని ఎయిర్ పోర్టులో కలిశా.. కంగనా రనౌత్

చంద్రముఖి 2 ప్రమోషన్స్ కోసం కంగనా రనౌత్ హైద్రాబాద్‌లో సందడి చేసింది. ఇక ఈ క్రమంలో తెలుగు హీరోల మీద కంగనా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె సినిమాలు, ఆమె మాటలు, కాంట్రవర్సీలు అన్నీ నెట్టింట్లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అది మీటూ అయినా, నెపోటిజం మీద అయినా, ప్రభుత్వాల మీద అయినా కూడా కంగనా ఫైర్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం కంగనా సౌత్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అప్పుడెప్పుడో ప్రభాస్‌తో కలిసి ఏక్ నిరంజన్ అని తెలుగు వారిని పలకరించింది. ఆ తరువాత మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు.రీసెంట్‌గానే తలైవి అంటూ సౌత్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు కంగనా చంద్రముఖి 2 అంటూ మరోసారి ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రెడీగా ఉంది. సెప్టెంబర్ 28న ఈ చిత్రం రాబోతోంది. ఈ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా తెలుగు మీడియాతో ముచ్చటించింది. ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసింది. మీడియాతో ముచ్చటించే క్రమంలో మన హీరోల మీద తన అభిప్రాయాన్ని చెప్పింది.

కంగనా అసలు పోకిరి సినిమాతోనే తెలుగులో లాంచ్ కావాల్సింది. కానీ ఆ టైంలో తన డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఇలియానా లైన్లోకి వచ్చింది. అయినా సరే పూరి మాత్రం కంగనాను వదల్లేదు. ఏక్ నిరంజన్ కోసం పట్టుకొచ్చాడు. అయితే పోకిరి సినిమాను మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను అని కంగనా చెప్పుకొచ్చింది.రాజమౌళి సర్‌తో పని చేయాలని ఉంది.. రామ్ చరణ్ సర్‌తో నటించాలని ఉంది.. అల్లు అర్జున్‌తో నటించాలని ఉంది..అల్లు అర్జున్‌ని ఎయిర్ పోర్టులో కలిశాను.. ప్రభాస్‌తో మళ్లీ ఇంకో మూవీ చేయాలని ఉంది.. సమంత లాంటి హీరోయిన్‌తో కలిసి నటించాలని ఉంది అంటూ కంగనా మన స్టార్ల గురించి చెప్పుకొచ్చింది.చంద్రముఖి 2 సినిమాలోకి చివరగా కంగనా వచ్చిందట. పి వాసు వేేరే కథను చెప్పేందుకు కంగనా వద్దకు వెళ్తే.. ఇంకా చంద్రముఖి పాత్రకు ఏ హీరోయిన్ ఫిక్స్ కాలేదని తెలుసుకుని, తానే నటిస్తాను అని అడిగి మరీ ఆఫర్ తీసుకున్నాను అంటూ కంగనా చెప్పిన మాటలు బాగానే వైరల్ అయ్యాయి. సౌత్‌లో తనకు ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది.

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page