top of page

తిరుమలలో శ్రీదేవి కూతురు చేసిన పనికి ఆశ్చర్యపోయిన భక్తులు✨

శ్రీదేవి కూతురిగా ఆడియన్స్‌కి పరిచయమైనప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది జాన్వీ కపూర్‌. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా వరుస ప్రాజెక్టులకి సైన్ చేస్తుంది. అయితే జాన్వీకి దైవ భక్తి ఎక్కువ అన్న విషయం ఫ్యాన్స్‌కి తెలిసిందే.

ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే తరచుగా జాన్వీ వస్తూనే ఉంటుంది. ఇక ఇటీవల మార్చి 6న తన బర్త్‌డే సందర్భంగా శ్రీవారి దర్శనం చేసుకుంది జాన్వీ కపూర్. తన ఫ్రెండ్స్ శిఖర్ పహారియా, ఒరీతో కలిసి ఆమె తిరుమల వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ తిరుమల టూర్‌ ఎలా జరిగిందో తెలుపుతూ జాన్వీ ఫ్రెండ్ ఒరీ తన యూట్యూబ్ ఛానల్‌లో తాజాగా ఓ వీడియో పెట్టాడు. చెన్నైలోని జాన్వీ ఇంటి నుంచి కారులో మూడు గంటల పాటు ప్రయాణించి తాము తిరుపతి చేరుకున్నామని ఆ తర్వాత జాన్వీ తాము నడక దారిన తిరుమల చేరుకున్నట్లుగా చెప్పాడు. ఇక మోకాళ్ల మిట్ట వద్ద జాన్వీ - శిఖర్‌ మోకాళ్లపై మెట్లెక్కినట్లు వీడియోలో కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాన్వీ కపూర్ భక్తికి తన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

వరుస ప్రాజెక్టులు ఇక తెలుగులో జూ ఎన్టీఆర్‌తో దేవర సినిమాలో యాక్ట్ చేస్తుంది జాన్వీ. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక రామ్ చరణ్‌తో RC 16 ప్రాజెక్టులో కూడా జాన్వీ నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది.


Related Posts

See All

సోష‌ల్ మీడియా రికార్డుల్లో కూడా తగ్గేదేలే.. స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్🎥✨

పుష్ప చిత్రంతో అంత‌ర్జాతీయంగా అభిమానుల‌ను సంపాందించుకున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ రోజు రోజుకు త‌న పాపులారిటీని పెంచుకుంటూనే పోతున్నాడు.

bottom of page