top of page

🌐 బ్రిటన్‌లో పర్యటిస్తున్న జైశంకర్ దంపతులు...🌍

ప్రధాని రిషి సునక్ అక్షతా మూర్తి దంపతులు జై శంకర్ దంపతులు ఒకరికొకరు దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అంతే కాదు భారతదేశ ప్రధాని మోడీ తరపున ఎస్.జైశంకర్ బ్రిటన్ ప్రధానికి అభినందనలు తెలిపారు. 🎉

ఎస్ జైశంకర్‌తో పాటు ఆయన భార్య క్యోకో జైశంకర్ లు రిషి సునక్ దంపతులు ఆదివారం (నవంబర్ 12) డౌనింగ్ స్ట్రీట్‌లో సమావేశమయ్యారు. 🏛️

దీపావళి రోజున బ్రిటిష్ ప్రధాని రిషి సునక్‌ని కలవడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ కూడా శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు మంత్రి జై శంకర్. భారతదేశం, UK సమకాలీన కాలానికి సంబంధించిన బంధాన్ని పునర్నిర్మించడంలో నిమగ్నమై ఉన్నాయని పేర్కొన్నారు. 🌍 రిషి సునక్ , అతని భార్య అక్షతా మూర్తి కలిసి జై శంకర్ దంపతులకు సాదర స్వాగతం పలికారు. 🎊 ఘనమైన ఆతిథ్యం ఇచ్చారు.

జైశంకర్ తన భార్య క్యోకో జైశంకర్ తో కలిసి రిషి సునక్‌కి క్రికెటర్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్‌ను, గణేశ విగ్రహాన్ని బహుకరించారు. ఈ విషయాన్ని జైశంకర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 🏏

జైశంకర్ ఆదివారం బ్రిటీష్ యుకె కౌంటర్ జేమ్స్ ని సందర్శించారు. ఆయన శనివారం బ్రిటన్‌ వెళ్లారు. నవంబర్ 15 వరకు యూకే పర్యటనలో ఉండనున్నారు. 🗺️

దీంతో పాటు ఇజ్రాయెల్, హమాస్ మధ్య నెలకొన్న సంక్షోభంపై ఇరువురు నేతలు చర్చించారు. ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద చర్యలను కూడా ఇద్దరు నేతలు ఖండించారు. 🌍

భారతదేశం, బ్రిటన్ దేశాలు అనేక సమస్యలపై కలిసి పనిచేస్తున్నాయి. పలు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఆర్ధిక, స్వేచ్ఛా వాణిజ్యంపై కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. 🌐

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page