top of page
MediaFx

హనుమాన్ తర్వాత మనకు కనిపించడా..?🚀

అ!, జాంబిరెడ్డి, హనుమాన్ సినిమాలతో దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్న దర్శకుడు ప్రశాంత్‌ వర్మ త్వరలో 'జై హనుమాన్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హనుమాన్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో జై హనుమాన్ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తర్వాత తెలుగు ప్రేక్షకులకు కనిపించక పోవచ్చు అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌ లో రెండు మూడు ప్రాజెక్ట్‌ లకు ఈ యువ దర్శకుడు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడని తెలుస్తోంది. అందులో మొదటగా రణవీర్ సింగ్‌ హీరోగా ఒక సినిమా ఉండబోతుంది. 

ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయ్యిందని, రణవీర్ సింగ్‌ కు స్టోరీ లైన్ చెప్పి ఓకే చెప్పించాడని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. బ్రహ్మరాక్షస అనే టైటిల్‌ తో రణవీర్ సింగ్‌ హీరోగా ప్రశాంత్‌ వర్మ సినిమా రూపొందబోతుంది. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించేందుకు భారీ బడ్జెట్‌ ను ఆఫర్‌ చేసిందని కూడా వార్తలు వస్తున్నాయి. జై హనుమాన్ సినిమా మీడియం రేంజ్ లో హిట్ అయినా కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా బ్రహ్మ రాక్షస సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. అతి త్వరలో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్‌ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. 

బ్రహ్మరాక్షస సినిమాను హిందీలో రూపొందించి సౌత్‌ లోని అన్ని భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట. ఇప్పటి వరకు బ్రహ్మ రాక్షస ఏ జోనర్ అనే విషయమై క్లారిటీ లేదు. జోనర్‌ ఏది అయినా ప్రశాంత్‌ వర్మ తనదైన మేకింగ్‌ తో కుమ్మేయడం ఖాయం. కనుక జై హనుమాన్‌ సినిమా విడుదల అవ్వడమే ఆలస్యం బాలీవుడ్‌ లో మనోడు జెండా పాతేందుకు వెళ్లడం కన్ఫర్మ్‌. ఒక వేళ బ్రహ్మ రాక్షస హిట్ అయ్యి ఆ తర్వాత చేయబోతున్న సినిమాలు కూడా అక్కడ మంచి ఫలితాలను రాబడితే ప్రశాంత్‌ వర్మ మనకు కనిపించడేమో..! 

bottom of page