🎓🏛️ వాషింగ్టన్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయిన 23 ఏళ్ల జాహ్నవి.. ఈ ఏడాది జనవరిలో సియాటిల్లో రోడ్డు క్రాస్ చేస్తుండగా..
వేగంగా వచ్చిన పోలీసు వాహనం ఢీ కొనడంతో ఆమె మరణించింది. 25 మైళ్ల స్పీడ్ లిమిట్ ఉన్నటువంటి ప్రదేశంలో ఆ పోలీసు వాహనం ఏకంగా 74 మైళ్ల వేగంతో దూసుకురావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తేలింది.
👩🎓🕵️♀️ ఆమెకు 26 ఏళ్లు. అంత విలువైనదేమీ కాదు. 11 వేల డాలర్ల ఓ చెక్కు రాసి పారేయండి అంటూ అతడి అన్న మాటలు బాడీ కెమెరాల్లోని రికార్డ్ అయ్యాయి. మరో విషయం ఏంటంటే.. అతనిపై ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, సియాటిల్ సిటీ కౌన్సిల్ సభ్యురాలు క్షమా సావంత్ తదితరులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికాలోని పోలీసుల్లో జాత్యహంకారం ఎంతగా జీర్ణించుకుపోయిందో చెప్పడానికి ఈ ఘటన మరో నిదర్శనమని పేర్కొన్నారు. డేనియల్పై ఇప్పుడైన కఠిననంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 🇺🇸🚓
Comments