top of page
MediaFx

సీఎం జగన్ ఆస్తుల వివరాలు..

వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున పులివెందులలో నామినేషన్‌ దాఖలు అయ్యింది. మున్సిపల్ వైస్ ఛైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల ఎన్నికల అధికారికి సీఎం జగన్‌ తరఫున ఒక సెట్‌తో కూడిన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నెల 25వ తేదీ ఆయనే స్వయంగా వచ్చి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. 25వ తేదీ ఇక్కడ బహిరంగ సభ ఉంటుంది. మద్యాహ్నం తర్వాతే ఆయన నామినేషన్‌ వేయనున్నారు. ప్రస్తుతం దాఖలు చేసిన నామినేషన్‌లో అఫిడవిట్ ప్రకారం సీఎం జగన్ ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.సీఎం జగన్ కుటుంబానికి మొత్తం 779.8 కోట్లు ఉన్నాయి. వివిధ కంపెనీల షేర్లతో సహా అన్ని రకాల చరాస్తులను పరిగణనలోకి తీసుకుంటే రూ.650.66 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో సీఎం జగన్‌ పేరున రూ.483.08 కోట్లు, భారతిరెడ్డి పేరిట రూ.119.38 కోట్లు, కుమార్తెలు హర్షిణి రెడ్డి పేరిట రూ.24.26 కోట్లు, వర్షా రెడ్డి పేరిట రూ.23.94 కోట్ల చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. తన కుటుంబం పేరిట రూ.106.96 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొ­న్నారు. జగన్‌ పేరున మార్కెట్‌ విలువ ప్రకారం రూ.46.78 కోట్ల విలువైన స్థిరాస్తి ఉండగా.. సీఎం సతీమణి భారతిరెడ్డి పేరిట రూ.56.92 కోట్లు ఉన్నాయి. ఇద్దరు కుమార్తెలు పేరుతో చెరో రూ.1.63 కోట్ల చొప్పున స్థిరాస్తులున్నాయి. తాజాగా 2022–23లో వైఎస్‌ భారతి రెడ్డి వ్యక్తిగత ఆదాయం రూ.10.96 కోట్లుగా పేర్కొనగా ఆమె ఇతరులకిచ్చిన రుణాలు రూ.30.91 లక్షల మేర ఉన్నాయి. రూ.1.57 కోట్లు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లించగా అడ్వాన్సు ట్యాక్స్‌ రూ.2.48 కోట్లు చెల్లించారు. ఆమె ఇతరుల నుంచి తీసుకున్న అడ్వాన్సులు, రుణాలు రూ.7,41,79,353 వరకూ ఉన్నాయి. 2022–23 సంవత్సరానికి సీఎం జగన్‌ వ్యక్తిగత ఆదాయం రూ.57.74 కోట్లు కాగా ఇతరులకు ఇచ్చిన రుణాలు రూ.179.74 కోట్ల వరకూ ఉన్నాయి. రూ.4.66 కోట్లు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌గా చెల్లించగా, ఈ ఏడాది అడ్వాన్సు ట్యాక్స్‌ రూ.13.95 కోట్ల మేర చెల్లించారు. ఇతరుల నుంచి తీసుకున్న అడ్వాన్సులు, రుణాలు రూ.1,1078,350 వరకూ ఉన్నాయి. తనపై వివిధ కోర్టుల్లో 26 కేసులు విచారణలో ఉన్నట్లు అఫిడవిట్‌లో జగన్‌ వెల్లడించారు.

Kommentare


bottom of page