top of page

'డబుల్ ఇస్మార్ట్' పూరితో రామ్ సీక్వెల్ ముహూర్తం ఆ రోజే!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఇస్మార్ట్ శంకర్'. బాక్సాఫీస్ బరిలో సూపర్ డూపర్ సక్సెస్ కొట్టింది. భారీ వసూళ్ళను సాధించింది.

సినిమా ఎండింగులో సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. తామిద్దరం మరో సినిమా చేస్తామని రామ్, పూరి అనౌన్స్ చేశారు. రామ్ పుట్టినరోజు సందర్భంగా సీక్వెల్ ప్రకటించారు. మరి, ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ముహూర్తం ఎప్పుడు? అంటేరామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్న 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ కు 'డబుల్ ఇస్మార్ట్' టైటిల్ ఖరారు చేశారు. పూరి స్పీడు గురించి తెలిసిందే కదా! సినిమా అనౌన్స్ చేసిన రోజున రిలీజ్ డేట్ కూడా చెబుతారు. వచ్చే ఏడాది మార్చి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు చెప్పారు. ఈ నెలలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. జూలై 7న పూజా కార్యక్రమాలతో 'డబుల్ ఇస్మార్ట్' సినిమా ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఐదు రోజులకు సెట్స్ మీదకు వెళ్లనున్నారు. జూలై 12 నుంచి 'డబుల్ ఇస్మార్ట్' రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page