top of page

🚆 తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు బిగ్ అలెర్ట్..తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు బిగ్ అలెర్ట్..

🚄 తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు బిగ్ అలెర్ట్ వచ్చేసింది. ప్రయాణీకుల రద్దీ, పండుగల దృష్ట్యా ప్రత్యేక రైళ్లను కాకినాడ-లింగంపల్లి మధ్య నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

ఆయా రైళ్లు సెప్టెంబర్ 1 నుంచి 13 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని.. స్పష్టం చేసింది. 🚂 07439 ట్రైన్ నెంబర్‌తో కాకినాడ టౌన్ – లింగంపల్లి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు వారంలో మూడు రోజులు (సోమ, బుధ, శుక్ర) నడవనుంది. ఆయా రోజుల్లో ఈ రైలు కాకినాడ నుంచి రాత్రి 8.10 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.

🚆 ఇక 07440 ట్రైన్ నెంబర్‌తో లింగంపల్లి-కాకినాడ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 2 నుంచి 14 వరకు ప్రతీ మంగళవారం, గురువారం, శనివారాల్లో ప్రయాణిస్తుంది. ఆయా రోజుల్లో ఈ రైలు సాయంత్రం 6.25 గంటలకు లింగంపల్లి నుంచి బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ టౌన్ చేరుకోనుంది. ఈ రెండు రైళ్లకు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, అకీవీడు, గుడివాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు స్టాప్పులుగా నిర్ణయించారు. ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉండనున్నాయి. 🛤️🚋🛌🎫


Comments


bottom of page