top of page

🚢💥 5 నౌకలను ఆర్డర్ చేసిన భారత రక్షణ శాఖ.. 💪🇮🇳

🛳️ విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌కు భారీ ఆర్డర్ కైవసం చేసుకుంది. రూ. 19 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు అప్పగిస్తూ రక్షణ శాఖ సంతకాలు చేసింది. 🏭🔧

ఈ కంట్రాక్ట్ ప్రకారం ఇండియన్ నేవీ అవసరాల కోసం ఐదు భారీ ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లు తయారు చేసి ఇవ్వవలసి ఉంటుంది. ⚓🚢 తద్వారా సముద్రంలో ఆపరేషన్లలో ఉన్న యుద్ధ నౌకలకు అవసరమైన ఇంధనం, నీరు, ఆయుధాలు, స్టోర్ పరికరాలు, ఆహారం అందించేందుకు ఈ నౌకలు ఉపయోగపడనున్నాయని సమాచారం. 🌊🛢️

📅 ఆగస్టు 16న జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో నావికా దళాన్ని పటిష్టం చేసే క్రమంలో ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లను కొనుగోలు చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. 📝⚙️ ఒక్కోక్క నౌక 44 వేల టన్నుల బరువుతో ఉండేలా డిజైన్లు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 📏🛠️ కంట్రాక్ ప్రకారం వీటిని 8 ఏళ్లలో నిర్మించి భారత రక్షణ శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. 🏭🔨

🇮🇳 అయితే ఇంత పెద్ద నౌకలను భారత్‌లో నిర్మించడం ఇదే తొలిసారి కావడం విశేషం. 🏢🔧 ఇంత భారీ నౌకల నిర్మాణం రంగంతో పాటు నౌకా నిర్మాణంలో అనుబంధ సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు విస్తృత అవకాశాలు కలుగుతాయని కేంద్రం చెబుతోంది. 🏭🔧🛳️🇮🇳


Opmerkingen


bottom of page