top of page

🇮🇳 నేడు భారత్‌ డ్రాగన్​తో 19వ దఫా చర్చలు.. సరిహద్దు వద్ద భారీగా సైనికుల మోహరింపు.. 💪

🤝భారత్​-చైనా సైనికాధికారుల 19వ దఫా సమావేశం నేడు జరగనుంది. సరిహద్దుల్లో శాంతియత వాతావరణం నెలకోల్పడం కోసం ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 🌍 ఈ నేపథ్యంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తన ఎయిర్ లిఫ్టింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచుకుంది. 🚀 అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను తూర్పు లడఖ్‌కు తరలించింది భారత్‌. 💥

🏔️ భారత్​-చైనా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు.. సైనిక అధికారుల స్థాయి చర్చలు మరోసారి జరగనున్నాయి. 1️⃣8️⃣ సార్లు సమావేశాలు జరగ్గా.. ఈ రోజు 19వ దఫా చర్చ జరగనున్నాయని అధికారులు తెలిపారు. 📅 వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా.. భారత్‌, చైనా సైనికాధికారుల చర్చలు సాగనున్నాయి. 🤝 1️⃣8️⃣వ దఫా చర్చలు ఏప్రిల్​ 2️⃣3️⃣న జరగ్గా.. నాలుగు నెలల తరువాత మరోసారి చర్చలు జరగనున్నాయి. 👥 ఈ చర్చలకు వేదికగా చుషుల్-మోల్డో సరిహద్దులోని భారత్​ వైపు ప్రాంతం అని తెలుస్తోంది. 🛤️

🌟 రెండు దేశాల ఆర్మీ ఉన్నతాధికారులు పలుమార్లు సైనిక చర్చలు జరపడంతో పరిస్థితులు కొంతమేర కుదుటపడ్డాయి. 💥 కానీ, ఊహించని పరిణామాలు ఎదురైతే వాటిని ఎదుర్కొనేందుకు ఎవరికి వారు సన్నద్ధమవుతున్నారు. 🤔

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page