top of page

షూటింగ్‌లో హీరో సూర్యకు ప్రమాదం.. స్పందించిన నిర్మాత


త‌మిళ స్టార్ హీరో సూర్య‌కు షూటింగ్‌లో ప్ర‌మాదం జ‌రిగింది. జిగ‌ర్‌తండా డబుల్ ఎక్స్ ద‌ర్శ‌కుడు కార్తిక్ సుబ్బ‌రాజు, సూర్య కాంబోలో ఒక సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ‘సూర్య 44’ గా వ‌స్తున్న ఈ ప్రాజెక్ట్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ షెడ్యూల్ అండ‌మాన్‌లో కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్‌ను ఊటీలో జ‌రుపుకుంటుంది. అయితే ఈ షూటింగ్ సమయంలో ప్రమాదం జరగడంతో సూర్య త‌ల‌కు గాయం అయిన‌ట్లు తెలుస్తుంది. ఇక ప్ర‌మాదం అయిన వెంటనే అప్రమత్తం అయిన చిత్రయూనిట్ గాయపడిన సూర్యను స్థానిక ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. కాగా ఈ విష‌యంపై నిర్మాత రాజశేఖరన్‌ పాండియన్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. డియ‌ర్ ఫ్యాన్స్ ఇది చిన్న గాయం. దయచేసి చింతించకండి, సూర్య ఇప్పుడు కోలుకున్నాడు. మీ అందరి ప్రేమ, ప్రార్థనలతో బాగున్నాడు ఆందోళన చెందొద్దంటూ విజ్ఞప్తి చేశారు.

ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. మ‌లయాళం న‌టుడు జోజు జార్జ్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మరోవైపు, సూర్య నటించిన ‘కంగువ’ సినిమా అక్టోబరు 10న విడుదల కానుంది. దర్శకుడు శివ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.



Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page