top of page
MediaFx

చెట్లను హగ్ చేసుకుంటే రూ.1500 చెల్లించాలి..


ప్రకృతి ప్రేమికులు చాలా మంది ఉంటారు. ఇక చెట్లను రక్షించేవారు, వాటిని ప్రేమించేవారు కూడా చాలా మంది ఉంటారు. కానీ ఈ కంపెనీ మాత్రం అందులో ఇంకాస్త వెరైటీ అన్నమాట. ఎందుకంటే చెట్లను కౌగిలించుకుంటే రూ.1500 వసూలు చేస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న కబ్బన్ పార్కులో ఈ నెల 28 వ తేదీన ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనేవారికి మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు చెట్లను హగ్ చేసుకోవడం, అడవిలో నడవడం వంటి రకరకాల కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ బాధ్యతలను ట్రోవ్ ఎక్స్‌పీరియెన్సెస్ అనే కంపెనీ.. ఫారెస్ట్ బాతింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు రూ.1500 చెల్లించాలని కండీషన్ కూడా పెట్టింది. అయితే ఈ ప్రకటనను చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మార్కెట్‌లోకి కొత్త స్కామ్‌ వచ్చిందని మండిపడుతున్నారు. చెట్లను కౌగిలించుకునేందుకు రూ.1,500 ఏంటి అంటూ కొందరు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Commenti


bottom of page