top of page

ఇకపై సిమ్‌ కొనడం అంత ఈజీ కాదు.. చాలా తతంగం ఉందిగా.. తెలుసుకోకపోతే ఇబ్బందే..

ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. వ్యక్తుల ప్రైవసీ ప్రమాదంలో పడుతోంది. వినియోగదాదరుల డేటాకు భద్రత లేకుండా పోతోంది. హ్యాకర్స్‌ సులభంగా వినియోగదారుల ఖాతాలను కొల్లగొడుతున్నారు.

ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. వ్యక్తుల ప్రైవసీ ప్రమాదంలో పడుతోంది. వినియోగదాదరుల డేటాకు భద్రత లేకుండా పోతోంది. హ్యాకర్స్‌ సులభంగా వినియోగదారుల ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఫిషింగ్‌ మెసేజ్‌ల ద్వారానో, లింక్‌ల ద్వారానో లేక ఫేక్‌ యాప్‌ల ద్వారానో, సిమ్‌ స్వాపింగ్‌ ద్వారానో సులభంగా మోసం చేస్తున్నారు. ఎన్ని భద్రతా ప్రమాణాలు తీసుకుంటున్నా సైబరాసులు ఏదో ఒకరకంగా చోరీలకుపాల్పడుతున్నారు. అయితే బ్యాంక్‌ అకౌంట్లను హ్యాక్‌ చేయడానికి ప్రధానంగా నకిలీ సిమ్‌ కార్డులతో నేరగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. అందుకు కారణం వారికి సులభంగా సిమ్‌ కార్డులు లభ్యమవుతుండటమే. దీనిపై ఫోకస్‌ పెట్టిన ప్రభుత్వం సిమ్‌ కార్డుల జారీపై ఆంక్షలు విధించింది. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి కఠినమైన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. తద్వారా స్కామ్‌లు, ఆన్‌లైన్‌ మోసాలను పరిహరించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నిబంధనలు పాటించకుండే మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 50లక్షల వరకూ జరిమానా విధిస్తామని హెచ్చిరించింది. అటు కొనుగోలుదారులకు, ఇటు విక్రయదారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

డిజిటల్ కేవైసీ..

దేశంలో 2024, జనవరి 1 నుంచి సిమ్‌ కార్డ్‌లు డిజిటల్ నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రక్రియ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ మార్పు ధ్రువీకరణ వ్యవస్థలో గణనీయమైన మార్పును కలిగి ఉంది. సిమ్‌ విక్రేతలు తప్పనిసరిగా ధ్రువీకరణ చేయించుకోవాలి. వాణిజ్య ప్రయోజనాల మినహా బల్క్ సిమ్‌ల పంపిణీ ఇకపై అనుమతించబడదు.

బయోమెట్రిక్ డేటా..

ప్రభుత్వం ధ్రువీకరణ వ్యవస్థలో కొన్ని మార్పులు చేసింది. ముఖ్యంగా సిమ్ విక్రేతలు ధ్రువీకరణ చేయించుకోవడం తప్పనిసరి చేసింది. వాణిజ్య ప్రయోజనాల కోసం మినహా బల్క్ సిమ్లను పంపిణీ చేయకూడదు. సిమ్ కొనుగోలు చేసే ప్రతి కస్టమర్ బయోమెట్రిక్ డేటాను సేకరించాలని టెలికాం కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ చర్య మోసపూరిత సిమ్ కార్డ్ కొనుగోళ్లను అరికట్టడం లక్ష్యంగా పెట్టుకుంది, సిస్టమ్‌ను మార్చేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. 

తప్పనిసరి వర్తింపు..

సమ్మతిని నిర్ధారించడానికి, టెలికాం ఫ్రాంఛైజీలు, సిమ్‌ పంపిణీదారులు, పాయింట్-ఆఫ్-సేల్ ఏజెంట్ల కోసం తప్పనిసరి రిజిస్ట్రేషన్ ఇప్పుడు అమలులో ఉంది. ఈ నిబంధనలను పాటించని డీలర్లకు రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించడం, సంభావ్య స్కామర్‌లను నియంత్రించడం, రాబోయే సంవత్సరంలో బాధ్యతాయుతమైన సిమ్‌ కార్డ్ లావాదేవీలను ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page