top of page

🥭🍽 బొప్పాయి తిన్న వెంటనే వీటిని తినేస్తున్నారా.. 🍹🍲

బొప్పాయి పండు తిన్న వెంటనే పాలు, పెరుగు, జున్ను, పాల ఉత్పత్తులు తీసుకోకూడదు. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను గ్రహించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి బొప్పాయి తిన్న తర్వాత వీటికి దూరంగా ఉండాలి. లేదంటే జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది. అంతే కాకుండా గ్యాస్, మలబద్ధకం, పొట్టలో వాపు వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది.

గుడ్లు:

బొప్పాయి తిన్న తర్వాత గుడ్లను కూడా తీసుకోకూడదు. అలాగే ఎగ్స్ తో తయారు చేసిన ఆహారాన్ని కూడా తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, అజీర్తి, పొట్ట సమస్యలు, వికారం వంటి వాటిని ఎదుర్కొనాల్సి వస్తుంది. మరి కొంత మందిలో అయితే వాంతులు కూడా అవ్వొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కూలింగ్ వాటర్:

సాధారణంగా ఏ పదార్థం తిన్నా వెంటనే నీరు తాగుతూ ఉంటారు. అలా బొప్పాయి తిన్న తర్వాత కూలింగ్ వాటర్ అస్సలు తాగ కూడదట. ఇలా తాగడం వల్ల బొప్పాయిలో ఉండే పోషకాలు శరీరానికి అందవు. అంతే కాకుండా జీర్ణ సమస్యలు కూడా తలెత్తవచ్చు.

ఫ్రూట్ సలాడ్:

బొప్పాయి తిన్న వెంటనే ఫ్రూట్ సలాడ్ కి కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. బొప్పాయి పండును తిన్న తర్వాత ఇతర పండ్లతో తయారు చేసిన సలాడ్ ను తినడం వల్ల జీర్ణ క్రియ దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ పండులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది అరగడానికి సమయం పడుతుంది. దీంతో గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు. 🌿💪

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page