IDC అధ్యయనం ప్రకారం 80 శాతం మంది స్మార్ట్ఫోన్ వినియోగదారులు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తొలి 15 నిమిషాలలోపు తమ మొబైల్ ఫోన్ను తనిఖీ చేస్తున్నారు. ⏰📴
అయితే నిద్ర లేచిన నిమిషాల వ్యవధిలోనే ఫోన్ని చెక్ చేస్తే ఎదుర్కొనే అనారోగ్య సమస్యలు ఏవంటే.. 🤳🧠
ఒత్తిడి పెరిగిపోతుంది. ఫోన్కు వచ్చిన కొత్త మెసేజ్లు, ఇమెయిల్లు, నోటిఫికేషన్లు, సోషల్ మీడియా అప్డేట్లు ఒత్తిడిని, ఆందోళనను కలిగిస్తాయి. ఇది ప్రశాంతమైన జీవనశైలికి అంతరాయం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 🧘♂️💡 అంతేకాకుండా నిద్రలేవగానే ఫోన్ చెక్ చేయడం వల్ల మీ మనసులో ప్రతికూలతలు పెరిగి రోజంతా ఆ ప్రభావం కనిపించే అవకాశం ఉందని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ నికోల్ బెండర్స్-హాడి పేర్కొన్నారు. 🧑⚕️🔍
Comments