top of page
Suresh D

ఢిల్లీ జట్టుకు షాక్.. కీలక ఆటగాడు దూరం..🏏

ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇటీవల వేలంలో రూ.4 కోట్లకు కొనుగోలు చేసిన ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ మొత్తం టోర్నీకి దూరం కానున్నాడు. బ్రూక్ వ్యక్తిగత కారణాల వల్ల IPL-2024 నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే హ్యారీ ఢిల్లీ ఫ్రాంచైజీకి సమాచారం అందించినట్లు సమాచారం. చివరి నిమిషంలో టీమ్ ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్ నుంచి   కూడా బ్రూక్ తప్పుకున్నాడు.ఐపీఎల్-2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున హ్యారీ బ్రూక్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఈ మేరకు వేలంలో జట్టు రూ.13.23 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 11 మ్యాచ్‌ల్లో 190 పరుగులు మాత్రమే చేశాడు. కాబట్టి SRH మేనేజ్‌మెంట్ హ్యారీని IPL-2024కి ముందు విడుదల చేసింది. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ హ్యారీ బ్రూక్‌ను రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది.🏏



bottom of page