top of page

తెలంగాణలో హాఫ్ డే స్కూల్స్..ఎప్పటి నుంచంటే 🏫??

తెలంగాణలో అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ చివరిలో, మేలో మొదలవ్వాల్సిన ఎండలు ఇప్పటినుంచే స్టార్ అవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్స్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే క్లాసులు జరగనున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూల్స్ పెట్టి, ఆ తర్వాత సమ్మర్ హాలీడేస్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పదో తరగతి పరీక్షా కేంద్రాలలో మాత్రం మధ్యాహ్నం తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం ఎగ్జామ్ నిర్వహించి, మధ్యాహ్నం పిల్లలకు క్లాసులు చెప్పనున్నారు. విద్యార్థుల లంచ్ అనంతరం టీచర్లు క్లాసులు నిర్వహిస్తారు. టెన్త్ ఎగ్జామ్స్ పూర్తయిన తరువాత తిరిగి ఉదయం వేళ స్కూల్స్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెప్పారు. 📚📅✏️


bottom of page