top of page
MediaFx

గుంటూరు కారం సినిమాను ఎంజాయ్ చేయలేకపోయా..

మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌ అంటే ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో అంచనాలు ఉంటాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. థియేటర్స్ లో ఓ మోస్తరుగా హిట్ టాక్ తెచ్చుకున్న ఈ రెండు సినిమాలు టీవీలో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.

తాజాగా గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాకు ముందుగా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆతర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది ఈ సినిమా. ఈ సినిమాలో మహేష్ బాబు తన నటనతో ఆకట్టుకున్నారు. మహేష్ బాబును మాస్ అవతార్‌లో చూడాలనుకున్న ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అయ్యారు. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల నటించింది. అలాగే ఈ సినిమాలో జగపతిబాబు కూడా నటించారు. కానీ ఆయన పాత్ర చాల తక్కువ సమయం ఉంటుంది. తాజాగా గుంటూరు కారం సినిమా గురించి జగపతిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

జగపతి బాబు చాలా సినిమాల్లో విలన్ గా చేశారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించారు జగపతిబాబు. తాజాగా ఆయన గుంటూరు కారం సినిమా గురించి మాట్లాడుతూ.. తనకు సినిమా నచ్చలేదు అని సూటిగా చెప్పారు జగపతిబాబు. అలాగే సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు అని అన్నారు జగపతిబాబు. మహేష్ బాబుతో కలిసి పనిచేయడం నాకు చాలా ఇష్టం. కానీ, గుంటూరు ఖరం నాకెలాంటి సంతోషాన్ని కలిగించలేదు అన్నారు జగపతి బాబు.

మొదట్లో పాత్రలు బలంగా అనిపించాయి. కానీ, వస్తూ పోతూ అంతా గందరగోళంగా మారింది. చివరికి సినిమా షూటింగ్ పూర్తి చేయడం కష్టమైంది. నేను చేయాల్సినవన్నీ చేశాను. ఇలాంటి సినిమాల్లో ఇలాంటి అద్భుతమైన కాంబినేషన్ మిస్ అవ్వాలని అనుకోలేదు అని అన్నారు జగపతిబాబు.

Comments


bottom of page