top of page

యువీ బ్యానర్ పై హీరో గోపీచంద్ కొత్త సినిమా..!

హీరో గోపీచంద్ తొలిసారిగా తెలుగు వెండితెరకు హీరోగా పరిచయమై, మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన తర్వాత కొన్ని సినిమాల్లో విలన్ గా నటించాడు. ఆ తర్వాత “యజ్ఞం” సినిమాతో హీరోగా బౌన్స్ బ్యాక్ అయిన సంగతి తెలిసిందే.

వరుసగా హిట్ సినిమాల్లో నటిస్తూ ఉన్న గోపీచంద్ కెరీర్ అనుకోకుండా డౌన్ ఫాల్ అయింది. రీసెంట్ గా చేసిన సినిమాలన్నీ మీడియం టు యావరేజ్ టాక్ రావడంతో ఈ హీరో కెరీర్ కాస్త స్లో అయిందనే చెప్పుకోవాలి. ప్రెజెంట్ ఈ హీరో ఒక హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు.రెబెల్ స్టార్ ప్రభాస్, హీరో గోపీచంద్ ఇద్దరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ గా బాలయ్య బాబు అన్ స్టాపబుల్ షో లో కూడా ఈ ఇద్దరు స్టార్స్ కలిసి ఆడియన్స్ కి ఐ ఫీస్ట్ చేసారు. వీరి ఫ్రెండ్షిప్ కి హీరో ప్రభాస్ వాల్యూ ఇస్తూ ప్లాప్స్ లో ఉన్న తన స్నేహితుడికి ఒక మంచి ఆఫర్ ని ఇచ్చాడని తెలుస్తుంది. ప్రభాస్ నటించినటువంటి రాధేశ్యామ్ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణని డైరెక్టర్ గా ప్రోత్సహిస్తూ యువి బ్యానర్ లో గోపీచంద్ హీరోగా భారీ బడ్జెట్ సినిమాని ప్లాన్ చేయడానికి రెడీ అయ్యారట.ప్రస్తుతం హీరో గోపీచంద్ రామబాణం సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో త్వరలోనే ఈ భారీ బడ్జెట్ సినిమా కూడా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ కి సంబంధించిన కొన్ని పనులు పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ ని ఆఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు రాధాకృష్ణ తన తొలి సినిమా జిల్ లో గోపీచంద్ తో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే.ఈ సినిమా కలెక్షన్ల పరంగా యావరేజ్ అనిపించుకున్నా, ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకొని మంచి మార్కులే కొట్టేసింది. ఇక మరోసారి ఈ కాంబినేషన్ వెండితెరపై రిపీట్ అవ్వబోతుండడంతో ఆడియన్స్ ఈ భారీ ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచుకుని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో ఇటు డైరెక్టర్, అటు హీరో ఇద్దరు కూడా తమ కెరీర్ లో సక్సెస్ కొట్టాలని కోరుకుందాం.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page