top of page

🇺🇸✈️ అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్..

📚 ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థులకు ఓ మంచి శుభవార్త అందింది. ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఇండియాకు చెందిన విద్యార్థులకు అమెరికా రికార్డు స్థాయిలో వీసాలను జారీ చేసింది.

అయితే అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి దరఖాస్తు చేసుకున్నటువంటి భారతీయ విద్యార్థులకు దాదాపు 90,000 కంటే ఎక్కువగా వీసాలను జారీ చేసినట్లు భారత్‌లోని యూఎస్‌ మిషన్ ‘ఎక్స్‌’ (ట్విటర్)లో పేర్కొంది. అయితే ప్రస్తుత సెషన్ కోసం స్టూడెంట్‌ వీసా దరఖాస్తులు ముగిసిన సందర్భంలో యూఎస్‌ మిషన్‌ ఈ గణాంకాలను విడుదల చేసేసింది. మరోవిషయం ఏంటంటే.. 2022లో అమెరికాలోని అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులతో ప్రపంచంలోని అగ్ర దేశంగా ఇదివరకు చైనా ఉండేంది. అయితే ఇప్పుడు చైనాను భారత్ అధిగమించింది. అలాగే 2020లో దాదాపు 2,07,000 మంది అంతర్జాతీయ భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఉన్నత విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా క్రమంగా పెరుగిపోతోందని.. తాజా నివేదిక తెలిపింది. ఇండియా నుంచి విద్యార్థులను ఆకర్షించేందుకు విదేశీ యూనివర్శిటీలు అందించే సులభతరమైన అప్లికేషన్ ఫార్మాలిటీలు.. అలాగే ఆర్థిక సాయం, స్కాలర్‌షిప్‌లు ఈ పెరుగుదలకు కారణంగా ఉన్నట్లు సమాచారం. అయితే గతంలో కూడా ఫ్రాన్స్ ఇండియా నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులను ఉన్నత విద్య కోసం తమ దేశానికి స్వాగతించాలనే లక్ష్యం కూడా పెట్టుకున్నట్లు పేర్కొంది. 🌏🎓🇮🇳🇺🇸💼📰

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page