🏆🇮🇳 ఆసియాకప్ ఫైనల్లో శ్రీలంకను మట్టికరిపించిన హైదరాబాద్ బౌలర్.. మహ్మద్ సిరాజ్ .. దేశ వ్యాప్తంగా మన్ననలు పొందుతున్నాడు.
ఫైనల్ మ్యాచ్ లో సూపర్ ఫర్మార్మెన్స్ తో అద్భుత బౌలింగ్ చేశాడు. ఒకే ఓవర్ లో నాలుగు వికేట్లు తీసి రాకార్డు సృష్టించాడు. ఫైనల్ మ్యాచ్లో ఆరు వికెట్లు శ్రీలంక పతనాన్ని శాసించాడు. ఆసియా కప్ను భారత్కు సునాయాశంగా అందించాడు. అయితే సిరాజ్ ఫర్మార్మెన్స్ పై ప్రశంసలు కొనసాగుతున్నాయి. సిరాజ్ అద్భుత ప్రదర్శనపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్ వేదికగా సిరాజ్ను కొనియాడారు. మన ప్రత్యర్థుల కోసం తాను ఇంతకు ముందెన్నడూ బాధపడలేదు. అయితే ఇప్పుడు మనం వారిపై ఏదో ఒక అతీంద్రియ శక్తిని విడుదల చేసినట్లుగా ఉంది. సిరాజ్ నువ్వొక మార్వెల్ అవెంజర్” అంటూ ఆకాశానికి ఎత్తాడు ఆనంద్ మహింద్ర. ఆయన ట్వీట్ కు ఓ అభిమాని విచిత్రమైన రిట్వీట్ చేశాడు. సార్, ప్లీజ్ సిరాజ్కు ఓ ఎస్యూవీని గిప్ట్ గా ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాడు. దానిపై ఆనంద్ మహీంద్రా బదులిస్తూ సిరాజ్కు గతంలోనే ఓ కారు ఇచ్చినట్లు తెలిపారు. 🎉🇮🇳🏏
Comments