top of page

గరుడ పురాణం ప్రకారం ఏ తప్పుకు ఎటువంటి శిక్ష విధిస్తారో తెలుసా..📜✨

సనాతన హిందూ ధర్మంలో రామాయణ,మహాభారత ఇతిహాసాలు..  అష్టాదశ పురాణాలున్నాయి. ఈ  అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణ మొకటి. ఈ గరుడ పురాణానికి చాలా ప్రాశస్త్యం ఉంది. దీనికి మహాపురాణ్ అని పేరు. ఈ గ్రంథం మనిషి చేసే కర్మల గురించి చెబుతుంది. చెడు పనులను విడిచిపెట్టి మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే గరుడ పురాణం సృష్టిలోని ప్రతి జీవికి పునర్జన్మ ఉందని.. అది కర్మలను అనుసరించి లభిస్తుందని చెప్తుంది. రోజూ జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలను, దోషాలను వాటి నివారణలు వంటి ఎన్నో విషయాలను గరుడపురాణం చెబుతోంది. అంతేకాదు మానవులు చేసే పాప పుణ్యాల ఫలితాలను విశదీకరిస్తుంది. కర్మల బట్టి మరణించిన తర్వాత స్వర్గం వెళతాడా నరకం వెళతాడా అనేది గరుడ పురాణం ఆధారంగా తెలుస్తుంది. గరుడ పురాణంలో పేర్కొన్న అపర కర్మలు.. వాటిని చేసిన మనిషి నరకంలో ఎలాంటి శిక్ష అనుభవిస్తారో తెలుసుకుందాం..


కష్ట పడకుండా ఇతరుల సొమ్ముని ఆశించి చేడు పనులు చేసినా ఇతరుల డబ్బులను దోచుకున్నా వారు నపుంసకుల లెక్క. ఇలాంటి వారిని మరణాంతరం నరకంలో తాడుతో కట్టి హింసిస్తారు. విపరీతంగా కొడతారు.   అపస్మారక స్థితి నుంచి మళ్ళీ స్పృహ వచ్చిన తరువాత మళ్ళీ కొడుతూ శిక్షిస్తారు.

ఇంటిలో పెద్దలను లేదా తమ కంటే పెద్దవారిని అవమానించేవారికి, ఇంటి నుంచి వెళ్లగొట్టే వారికి కూడా గరుడపురాణంలో శిక్ష పేర్కొంది. ఇలాంటి పాపులను నరకంలో అగ్ని ముంచుతారు. చర్మం తొలగే వరకు ఈ శిక్షను కొనసాగిస్తారు.

మూగజీవులను హింసించే వారికీ కూడా కఠిన శిక్ష విధిస్తారు. ఇలాంటి పాపులను వేడి నూనె పోసిన పెద్ద పాత్రలో వేయిస్తారు.

తమ ఆనందం కోసం ఇతరుల ఆనందాన్ని హరించే వ్యక్తులకు కూడా గరుడ పురాణంలో శిక్ష పేర్కొంది. ఇటువంటి వారిని విషపు పాములున్న బావిలోకి పడేస్తారు. 

భర్త లేదా భార్య వివాహిత సంబంధం పెట్టుకున్నా అంటే ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకుంటే వీరి అవయవాల్లో ఇనుమును కాల్చి పోసి శిక్షిస్తారు.

జంతువులను బలి ఇచ్చి వాటి మాంసాన్ని తిన్న వారికీ కూడా నరకంలో శిక్ష ఉంది. వీరిని నరకంలో జంతువుల మధ్య వదిలేస్తారు.

స్త్రీలను నమ్మించి మోసం చేసినా, అత్యాచారం చేసిన పురుషులకు కూడా శిక్షలు ఉన్నాయి. ఇలాంటి  పురుషులు నరకంలో జంతువులుగా మారుతారు. మలమూత్రంతో నిండిన బావిలో వీరిని ఉంచి శిక్షిస్తారు.

అమాయకులను హింసించి ఆనంద పడే వ్యక్తులకు కూడా శిక్ష ఉంది. వీరు వైతరిని నది దగ్గర శిక్ష అనుభవించాలి. మానవ శరీరాలు, పుర్రెలు, అస్థిపంజరాలు, రక్తం, చీముతో నిండి ఉన్న చోట జీవించాల్సి ఉంటుంది.

సాధారణ ప్రజలను వేధిస్తూ, హింసించే వారికి ప్రమాదకరమైన జంతువులు, పాములు ఉన్న బావిలోకి విసిరేస్తారు.

bottom of page