top of page

శామీర్‌పేటలో కాల్పుల కలకలం..🚨

హైదరాబాద్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. నగర శివారులోని శామీర్ పేట్ సెలబ్రెటీ క్లబ్‌లో ఓ యువకుడు కాల్పులకు పాల్పడ్డాడు. సిద్ధార్థ్ దాస్ అనే వ్యక్తిపై మనోజ్ కుమార్ అనే యువకుడు కాల్పులు జరిపాడు. కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరపడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అయితే సిద్ధార్థ్‌ భార్యతో మనోజ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. సిద్ధార్థ్‌ భార్యతో మనోజ్‌ 2019 నుంచి సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మనోజ్‌, సిద్ధార్థ్‌ భార్య ఇద్దరూ సెలబ్రిటీ క్లబ్‌లో ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సిద్ధార్థ్‌ దాస్‌ సెలబ్రిటీ క్లబ్‌కు చేరకున్నాడు. వివాహేతర సంబంధం విషయమై క్లబ్‌లో ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయిన మనోజ్‌.. సిద్ధార్థ్‌పై ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపాడు. అయితే గన్‌లో పెల్లెట్స్ లేకపోవటంతో ఎలాంటి గాయాలు కాలేదు. ఆ తర్వాత సిద్ధార్థ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిద్ధార్థ్ కూతురు, కొడుకు ఇద్దరూ భార్యతోనే ఉంటుండగా.. పిల్లల్ని మనోజ్ వేధిస్తున్నట్లు తెలుసుకొని సిద్ధార్థ్ వారిని చూసేందుకు సెలబ్రిటీ క్లబ్‌లోని రిసార్ట్‌ విల్లాకు వచ్చాడు. ఈ సమయంలో జరిగిన వాగ్వాదాం నేపథ్యంలో సిద్ధార్థ్‌పై మనోజ్‌ కాల్పులు జరిపాడు. నిందితుడు మనోజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు. కాగా, ఈ కాల్పుల ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 😮👨‍👩‍👧‍👦✨

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page