top of page
Suresh D

టాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్‌..🎥✨

ఓ బిల్డింగ్ కట్టాలంటే ముందు పునాది బలంగా ఉండాలి.. ఆ తర్వాత దాని మీద ఎన్ని ఫ్లోర్స్ అయినా వేయొచ్చు. ఇండస్ట్రీలోనూ ఇదే జరుగుతుంది. ముందు ఓ బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు.. ఆ తర్వాత సీక్వెల్స్‌తో వాటిని క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా టిల్లు భాయ్ చేసింది కూడా ఇదే.  ఒకప్పుడు సీక్వెల్ అనే మాట వింటే చాలు మన నిర్మాతలకు గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి. దానికి కారణం కూడా లేకపోలేదు. శంకర్ దాదా జిందాబాద్, గాయం 2, సర్దార్ గబ్బర్ సింగ్, కిక్ 2, నాగవల్లి, ఆర్య 2.. ఇలా ఒకటా రెండా కొన్నేళ్ల వరకు సీక్వెల్స్ అన్నీ ఫ్లాపులే. కానీ బాహుబలి 2, కార్తికేయ 2, బంగార్రాజు, ఎఫ్ 3 లాంటి సినిమాలతో ఇప్పుడా సెంటిమెంట్ మారింది. సీక్వెల్స్ హిట్ అవుతుండటంతో అదే ట్రెండ్ చేస్తున్నారు మేకర్స్. పాత కథలకు కొనసాగింపు చేస్తున్నారు దర్శకులు. అలా చేస్తే.. ప్రాజెక్ట్‌పై అంచనాలు పెంచాల్సిన పనే లేదు.. ముందు సినిమానే అన్నీ చూసుకుంటుంది. ఆ బ్రాండ్‌పైనే ఇంకో సినిమా చేస్తున్నారు. తాజాగా టిల్లు స్క్వేర్‌పై ఈ రేంజ్ అంచనాలకు.. ఓపెనింగ్స్‌కు కారణం కూడా డిజే టిల్లు అనే బ్రాండ్. బాహుబలి, కేజియఫ్‌కు ఈ సీక్వెల్స్ బాగా హెల్ప్ అయ్యాయి. అందుకే పుష్ప, దేవర, సలార్‌కు ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారు. ఇవన్నీ ఒకే కథను రెండు భాగాలుగా చెప్పడం. కానీ కొందరు కారెక్టర్‌ను తీసుకుని సీక్వెల్ చేస్తూ.. ఆ క్రేజ్ క్యాష్ చేసుకుంటున్నారు. ఎఫ్ 2కు ఎఫ్ 3.. డిజే టిల్లుకు టిల్లు స్క్వేర్ అలాగే చేసారు. ఇప్పుడు ప్రతినిథి సీక్వెల్ ప్రతినిథి 2  గూడఛారి 2తో రానున్నారు. అలాగే ఇస్మార్ట్ శంకర్ కారెక్టరైజేషన్‌తోనే డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నారు పూరీ జగన్నాథ్. ఇలా ఎటు చూసినా సీక్వెల్సే కనిపిస్తున్నాయిప్పుడు.🎥✨

bottom of page