top of page
MediaFx

ఏపీలో సంచలనం రేపుతున్న ఈవీఎం ధ్వంసం.. EC మరో కీలక నిర్ణయం!🚨


ఓ వైపు పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలిస్తుంటే.. మరోవైపు ఏపీలో ఆయన కేంద్రంగానే పొలిటికల్ పంచాయితీ కొనసాగుతోంది. ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు పెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటే.. వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఇక ఈ ఘటన సమయంలో విధుల్లో ఉన్న ఉద్యోగులపై వేటు వేసింది ఎన్నికల సంఘం.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పొలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేస్తున్న వీడియో వెలుగులోకి రావడం సంచలనంగా మారడంతో పాటు.. ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. పిన్నెల్లి వ్యవహారంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా.. పోలింగ్ సందర్భంగా మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని అన్నారు. అందులో 7 మాచర్ల నియోజకవర్గం పరిధిలోనే జరిగాయని వెల్లడించారు. పిన్నెల్లిపై వేర్వేరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని మీనా తెలిపారు.

ఇక ఘటనపై అధికారులపై చర్యలు షురూ చేసింది ఎన్నికల సంఘం. పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన పోలింగ్ అధికారి సహా ఇతర సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. మాచర్ల పోలింగ్ స్టెషన్ లో ఈవియం ధ్వంసం చేసిన వీడియో వెలుగులోకి రావడంతో సిబ్బందిపై సస్పెన్షన్ వేటుకు గురి చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్‌లో అడుగు పెట్టిన సమయంలో అక్కడ ఉన్న పోలింగ్ అధికారి, సిబ్బంది పిన్నెల్లిని అడ్డుకోకపోవడంపై చర్యలు తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మే 23 గురువారం సాయంత్రంలోపు సంజాయిషీ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

bottom of page