top of page

🚨 తెలంగాణలో పోలింగ్ సర్వం సిద్ధం...🚨

పోలింగ్ సండదర్భంగా అధికారులకు బాధ్యతలు అప్పగించింది ఎన్నికల సంఘం. ప్రతి పోలింగ్ బూత్ లో ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు సహాయ అధికారులు ఉంటారు.

ప్రిసైడింగ్ అధికారులు పి.ఓ డైరీ, ఫారం-17ఏ, 17 సి పరిశీలించి నమోదు చేయాల్సి ఉంటుంది. పి.ఓ ల వద్ద సంబంధిత పోలింగ్ స్టేషన్ ఓటర్ల జాబితా, ఏ.ఎస్.డి లిస్ట్ కలిగి ఉంటారు. ఉదయం 5:30 గంటలకే పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ ను నిర్వహిస్తారు. 50 ఓట్లను వేసి వాటిని సి.ఆర్.సి ద్వారా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా వచ్చే వి.వి.ప్యాట్ స్లిప్ లను భద్రపరుస్తారు. ఇక పోలింగ్ రోజు ఓటర్లు ఎపిక్ కార్డుతో పాటు భారత ఎన్నికల సంఘం సూచించిన డాక్యుమెంట్లు వెంట తీసుకుని రావల్సి ఉంటుంది.

వెంట తీసుకుని రావల్సిన ధృవపత్రాలు ఇవేః

ఆధార్ కార్డు

పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ జారీచేసిన ఫోటో తో కూడిన పాస్ బుక్

‌3. కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా జారీచేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు

డ్రైవింగ్ లైసెన్స్

పాన్ కార్డు

RGI ద్వారా జారీచేసిన స్మార్ట్ కార్డు

ఇడియన్ పాస్ పోర్టు

ఫోటోతో కూడిన పింఛ‌న్‌ మంజూరు డాక్యుమెంట్

ఫోటో తో కూడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం/PSUs/Public Limited Companies ఉద్యోగ గుర్తింపు కార్డు

ఎం.ఎల్‌.ఏ, ఎం.పి, ఎమ్మెల్సీలు జారీచేసిన అధికార గుర్తింపు ప‌త్రం.

దివ్యాంగుల గుర్తింపు కార్డు ఏదైనా ఒక గుర్తింపు కార్డులను వెంట తీసుకొని ఓటు హక్కు వినియోగించు కావాలని తెలిపారు.

ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు 29వ తేదీన సంబంధిత డి.ఆర్.సి సెంటర్లకు వెళ్లి ఈ.వి.ఎం లను సేకరించుకొని నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రిసైడింగ్ అధికారులు చెక్ లిస్ట్ ఆధారంగా క్రమపద్దతిలో తమ విధులను నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 🗳️✅

Kommentare


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page