top of page

🏔️🙏 పార్వతీ కుండ్‌, జగేశ్వర్‌ ఆలయాలను ప్రతి ఒక్కరూ సందర్శించాలి.. 🙏🏔️

🇮🇳 ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. 🏞️ అక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేతమ్రైన పితోర్‌గఢ్‌లోని పవిత్ర పార్వతీ కుండ్‌లో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 🙏

ఈ సందర్భంగా మోడీ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. 😯 తలపాగాతో పాటు స్థానిక సంప్రదాయ దుస్తులు ధరించి మోడీ ఈ పూజల్లో పాల్గొన్నారు. 🙄 అలాగే ఢమరుకం, శంఖానాదాలతో శివుడిని ప్రార్థించారు. 🕉️ అనంత‌పరం జోలింగ్‌కాంగ్‌లోని పార్వతి కుండ్ ఒడ్డున ఉన్న శివ-పార్వతీ ఆలయంలో కూడా ప్రధాని మోడీ పూజలు నిర్వహించారు. 🙏 ఆ తర్వాత కైలాస శిఖరం ముందు కాసేపు కూర్చుని ధ్యానం చేశారు. 🧘‍♂️ ఆపై అక్కడి జగదేశ్వర్ ధామ్, సరిహద్దున ఉన్న గుంజీ గ్రామాన్ని కూడా సందర్శించారు. 🏞️ భారత్-చైనా సరిహద్దులోని పితోర్‌గఢ్‌కు వచ్చిన తొలి ప్రధాని నరేంద్ర మోడీయే కావడం విశేషం. 😃 ఈ సందర్భంగా గుంజీ గ్రామస్తులతోనూ సమావేశమయ్యారు ప్రధాని. 🤝 అక్కడి గ్రామస్తులు తయారు చేస్తున్న స్థానిక ఉత్పత్తులను పరిశీలించి ప్రశంసలు కురిపించారు. 👏 అనంతరం తన పర్యటన వివరాలను ట్విట్టర్‌ వేదికగా అందరితో పంచుకున్నారు. 📱 ‘ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్‌లోని పవిత్ర పార్వతి కుండ్‌లో దర్శనంతో నేనెంతో సంతోషించాడు. 🥰 ఇక్కడ పూజ‌లు నిర్వహించి నేనెంతో పొంగిపోయాను. 😊 ఇక్కడ జ‌రిగిన ఆది కైలాస దర్శనంతో నా మనసు కూడా ఎంతో సంతోషించింది. 🏞️ ప్రకృతి ఒడిలో నెలకొని ఉన్న ఆధ్యాత్మికత, సంస్కృతికి సంబంధించిన ఈ ప్రదేశం నుంచి మన దేశంలోని కుటుంబ సభ్యులందరూ సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. 🇮🇳❤️ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 🙌

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page