top of page

🌐 భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌కు ఎలన్ మస్క్ సపోర్ట్‌! 🌍

భద్రతా మండలి సంస్కరణలపై చర్చల్లో పురోగతి లేకపోవడం పట్ల పలు సందర్భాల్లో ప్రపంచ వేదికలపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం భద్రతా మండలిలో ఐదుగురు శాశ్వత సభ్యులు, పది మంది తాత్కాలిక సభ్యులు ఉన్నారు.

UN జనరల్ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి తాత్కాలిక సభ్యులు ఎన్నుకోబడతారు. భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్యులు-రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, అమెరికా.. యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసే కీలక తీర్మానంపై వీటో అధికారాన్ని కలిగి ఉన్నాయి. ఆ వీటో అధికారంతోనే భారత్‌కు భద్రతా మండలిలో శాశ్విత సభ్యత్వం కల్పించే ప్రతిపాదనలను చైనా అడ్డుకుంటోంది.

భద్రతా మండలిలో శాశ్విత సభ్యత్వం కోసం భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో భారత్‌కు సపోర్ట్‌గా ఎలన్ మస్క్ స్పందించడం ఆసక్తికరంగా మారింది. అటు అఫ్రికా దేశాలకు ఐరాస భద్రతా మండలిలో శాశ్విత సభ్యత్వం లేకపోవడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. 80 ఏళ్లుగా ఉన్న ప్రస్తుత భద్రతా మండలి శాశ్విత సభ్యత్వాన్ని రద్దు చేసి.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దాన్ని సంస్కరించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. 130 కోట్లకు పైగా జనాభా కలిగిన భారత్‌కు భద్రతా మండలిలో శాశ్విత సభ్యత్వం లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు అంతర్జాతీయ ప్రముఖులు. 🌍✨

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page