top of page

🚗🔋 ఎలక్ట్రిక్ వాహనాలు పెట్రోల్, డీజిల్ కంటే ఎక్కువ కాలుష్యాన్ని కలిగిస్తాయి..🌿🌍

చమురుతో నడిచే కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాల బ్రేక్‌లు, టైర్లు 1850 రెట్లు ఎక్కువ కాలుష్యాన్ని వ్యాపింపజేస్తాయని పరిశోధన నివేదిక పేర్కొంది. ఈ అధ్యయనం ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ కంటే కాలుష్యం పరంగా ఎలక్ట్రిక్ వాహనాలు సురక్షితమైనవని నమ్ముతారు. అవి తక్కువ గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తాయి. అయితే దీనిపై కొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

ఎమిషన్ అనలిటిక్స్ నివేదిక ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ బరువు కలిగి ఉంటాయి. అధిక బరువు కారణంగా దాని టైర్లు త్వరగా అరిగిపోతాయి. అంటే ఆ టైర్ల వ్యాలిడిటీ వేగంగా తగ్గిపోతుంది. అవి హానికరమైన రసాయనాలను గాలిలోకి విడుదల చేస్తాయి. చాలా టైర్లు ముడి చమురు నుండి పొందిన సింథటిక్ రబ్బరుతో తయారు చేయబడతాయి. ఇవి కాలుష్యానికి కారణమవుతాయి. ఈవీ బ్యాటరీ పెట్రోల్ ఇంజిన్ కంటే భారీగా ఉంటుంది. ఈ అదనపు బరువు బ్రేక్‌లు, టైర్లపై పడి వాటి జీవితకాలం వేగంగా తగ్గిపోతుంది. పరిశోధన నివేదికలో టెస్లా మోడల్ Y, ఫోర్డ్ F-150 రెండు వాహనాలు సుమారు 1800 పౌండ్ల బ్యాటరీని కలిగి ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో అమర్చిన ఈ అర టన్ను బ్యాటరీ పెట్రోల్ కారు కంటే 400 రెట్లు ఎక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఈ విధంగా, సురక్షితంగా భావించే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా కాలుషానికి కారణమవుతాయని నివేదిక తెలిపింది. ⚡🔍

bottom of page