top of page
Suresh D

నేడు ఎన్నికల షెడ్యూల్✨

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు శనివారం నగారా మోగనుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈసీ విడుదల చేయనుంది. విజ్ఞాన్‌భవన్‌ ప్లీనరీ హాల్‌లో జరిగే మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌‌తో పాటు ఇద్దరు కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్‌, సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధులు సాధారణంతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు తేదీలు వెల్లడించనున్నారు. 18వ లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగున్నాయి.ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి మీడియాకు ప్రెస్‌నోట్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసింది. 


bottom of page