top of page

కొడుకుని హత్య చేసి.. ఉడకబెట్టుకుని తిన్న తల్లి..

అమ్మను మించిన దైవమున్నదా అని అంటారు. అవును, అమ్మ ఆ దేవం కంటే గొప్పది. నవమాసాలు తన కడుపులో మోసి.. జన్మనిచ్చి పెంచిపెద్దను చేస్తుంది. తన పిల్లలకు ఎలంటి అపాయం కలిగినా ఆ తల్లి గుండె తల్లడిల్లిపోతుంది. కానీ, ఈ తల్లి మాత్రం మాతృత్వానికే మాయని మచ్చను తెచ్చిపెట్టింది.

అమ్మను మించిన దైవమున్నదా అని అంటారు. అవును, అమ్మ ఆ దేవం కంటే గొప్పది. నవమాసాలు తన కడుపులో మోసి.. జన్మనిచ్చి పెంచిపెద్దను చేస్తుంది. తన పిల్లలకు ఎలంటి అపాయం కలిగినా ఆ తల్లి గుండె తల్లడిల్లిపోతుంది. కానీ, ఈ తల్లి మాత్రం మాతృత్వానికే మాయని మచ్చను తెచ్చిపెట్టింది. ఇంతకంటే పెద్ద పదం ఉపయోగించినా తప్పులేదు. ఎందుకంటే.. తన కొడుకు చంపేసి, వండుకుని తినేసింది ఆ తల్లి. ఈ ఘోరమైన, భయంకరమైన ఘటన ఈజిప్టులో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా న్నాయి.

ఈజిప్టులోని ఫకస్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హనా మహ్మద్ హసన్‌ తన భర్త నుంచి విడాకులు తీసుకుని.. 5 ఏళ్ల కొడుకు యూసుఫ్‌తో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. హనా మానసిక రుగ్మతలతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే.. హనా.. తన కుమారుడు యూసుఫ్‌ను కత్తితో పొడిచి చంపేసింది. ఆపై తలను మొండెంను వేరు చేసింది. తల భాగాన్ని ముక్కలు చేసి వేడి నీటిలో ఉడకబెట్టకుని తినేసింది.

కుమారుడని హత్య చేసిన తరువాత మహిళ ఆ చిన్నారి మృతదేహాన్ని నీటిలో పెట్టింది. అయితే, ఇంటి పక్కనే ఉంటున్న బంధువు కొడుకు ఇంటికి రాగా.. యూసుఫ్ కనిపించలేదు. బుక్‌లో మృతదేహానికి సంబంధించిన కొన్ని ముక్కలు కనిపించాయి. అనంతరం విషయాన్ని పోలీసులకు తెలియజేయగా.. వారు వచ్చి హనాను విచారించారు. విచారణలో షాకింగ్ వివరాలను వెల్లడించింది. కుమారుడి తల భాగం ఎక్కడుందని ప్రశ్నించగా.. తినేసినట్లు చెప్పింది.

Commentaires


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page