డిసెంబర్ 7న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది మంత్రులకు సీఎం కేసీఆర్ తాజాగా శాఖలు కేటాయించారు. కీలమైన ఐటీ శాఖను దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కేటాయించారు. పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా సీతక్క వ్యహహరించనున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈనెల 7 సీఎంగా రేవంత్తో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. వారికి ఆ సమయంలో శాఖలు కేటాయించలేదు. శాఖలు కేటాయించకుండానే.. డిసెంబర్ 8న సీఎం రేవంత్ తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఢిల్లీ వెల్లిన సీఎం రేవంత్.. మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చించారు. ఇవాళ తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతుండగా.. తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించారు. కాగా, కీలకమైన హౌంశాఖను ఎవరికి కేటాయించలేదు. మరో ఆరుగురికి మంత్రి వర్గంలో స్థానం కల్పించనుండగా.. వారికి ఏ శాఖలు కేటాయిస్తారని ఆసక్తిగా మారింది.
మంత్రులకు కేటాయించిన శాఖలు..📅👥
రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హోం,
మల్లు భట్టి విక్రమార్క - డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి - పౌరసరఫరాల శాఖ, నీటి పారుదల శాఖ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి- ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ
శ్రీధర్ బాబు- ఐటీ, ఇండస్ట్రీస్, శాసనసభ వ్యవహారాలు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- రెవెన్యూ, హౌజింగ్, ఐ అంట్ పీఆర్ (సమాచార శాఖ)
కొండా సురేఖ- అటవీ, దేవాదాయశాఖ
సీతక్క- పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల
తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయ, చేనేత
జూపల్లి- ఎక్సైజ్, టూరిజం
పొన్నం రవాణా, బీసీ సంక్షేమ శాఖ
దామోదర రాజనర్సింహ్మ- వైద్యారోగ్యశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ
ఐటీ శాఖను ఎవరికి కేటాయిస్తారనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ ఆశాఖను సమర్థవంతంగా నిర్వహించగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది. ముందుగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎల్లారెడ్డి పేట ఎమ్మెల్యే మదన్ మోహన్ పేర్లు తెరపైకి రాగా.. చివరికి శ్రీధర్ బాబుకు ఐటీ మంత్రిగా అవకాశం దక్కింది. ఇక హోంమంత్రి పదవి సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలలో ఎవరో ఒకరికి కేటాయిస్తారనే ప్రచారం జరగ్గా.. ఆ శాఖను ఎవరికి కేటాయించకుండా సీఎం రేవంత్ వద్దే ఉంచుకున్నారు.🚪🌐