top of page

డ్రోన్ డెలివరీలు: ముంబైలో సరికొత్త సేవలను ప్రారంభించిన బ్లూ డార్ట్

ఆన్‌లైన్ డెలివరీ సంస్థలు వచ్చిన తర్వాత ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఈ విధానం కొత్త పుంతలు తొక్కింది. డ్రోన్ల ద్వారా వస్తువులను, ఆహారాన్ని మీ ఇంటి గుమ్మం ముందుకు తెచ్చే ప్రక్రియ భారత్‌లో మొదలైంది. ఆసియాలో ప్రసిద్ధి చెందిన కొరియర్ సంస్థ బ్లూ డార్ట్ డ్రోన్ డెలివరీ సేవలను ముంబైలో ప్రారంభించింది. బ్లూ డార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ బాల్ఫోర్ మాన్యూయేల్ తెలిపారు, ఈ విధానం ద్వారా డెలివరీ వేగం పెరగడంతో పాటు అదనపు ప్రయోజనాలు ఉంటాయి.

సుమారు 5 ఏళ్ల కిందట టాలీవుడ్‌లో విడుదలైన "యుద్ధం శరణం" సినిమాలో డ్రోన్ల ద్వారా మెడిసిన్ డెలివరీ చేసే విధానం చూపించారు. కానీ, ఇప్పుడు ఆ డ్రీమ్ నిజమైంది. తెలంగాణ సర్కార్ డ్రోన్ల ద్వారా మెడిసిన్ సరఫరా పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా ట్రయల్స్ చేసింది. 2021 సెప్టెంబర్‌లో వికారాబాద్‌లో ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. బ్లూ డార్ట్.. డ్రోన్ టెక్నాలజీ సంస్థ స్కై ఎయిర్ సహకారంతో ఈ సేవలను ప్రారంభించింది.

ఇ-కామర్స్ రంగంపై దృష్టి సారిస్తూ ఈ డ్రోన్ టెక్నాలజీ వినూత్నంగా ఉంటుంది. బ్లూ డార్ట్ తెలిపింది, డ్రోన్ల ద్వారా సమయం ఆదా కావడంతోపాటు పర్యావరణానికి నష్టం తగ్గుతుంది. బ్లూ డార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ బాల్ఫోర్ మాన్యూయేల్.. భారత్‌లో లాజిస్టిక్స్ రంగం ప్రస్తుతం దూసుకెళ్తుందని చెప్పారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page