top of page

హత్యాచార ఘటనపై వైద్యుల నిరసన.. దేశ వ్యాప్తంగా నిలిచిన వైద్య సేవలు


కోల్‌కతా సహా ఢిల్లీ, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ సహా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు 24 గంటల పాటు సమ్మెకు దిగారు. వైద్యుల నిరసనతో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకూ 24 గంటల పాటూ వైద్య సేవలు అందుబాటులో ఉండవు. ఔట్‌ పేషెంట్‌ సేవలు, ఎంచుకున్న శస్త్రచికిత్స సేవలూ ఉండవు. అత్యవసర వైద్య సేవలు మాత్రం కొనసాగనున్నాయి.

మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) కేంద్ర ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లు ఉంచింది. ఎయిర్‌పోర్టుల మాదిరిగా దేశవ్యాప్తంగా ఉన్న దవాఖానలను కూడా ‘సేఫ్‌ జోన్లు’గా ప్రకటించాలని ఐఎంఏ చీఫ్‌ డాక్టర్‌ ఆర్‌వీ ఆశోకన్‌ డిమాండ్‌ చేశారు. వైద్యులు, సిబ్బందిపై దాడుల కట్టడికి కఠిన చట్టం తీసుకురావాలన్నారు. బాధితురాలి కుటుంబానికి గౌరవప్రదమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వైద్యుల పని గంటలు, పని పరిస్థితులపై ఐఎంఏ మరో డిమాండ్‌ చేసింది. హత్యాచారానికి గురైన బాధితురాలు వరుసగా 36 గంటల పాటు డ్యూటీలో ఉన్నారని, ఇది సరైనదేనా? అని ప్రశ్నించారు.







Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page