top of page

‘ఆ పని చేసి పోలీసులకు చిక్కిన ధనుష్ కొడుకు..’

🏍️ ధనుష్ కొడుకు యాత్రకు కూడా బైక్‌లంటే పిచ్చి. తాజాగా ఆయన సూపర్‌ స్పోడ్స్ బైక్‌ నడుపుతున్న వీడియో వైరల్‌గా మారింది. మరో వ్యక్తి బైక్ నడపడం నేర్పిస్తూ కనిపించాడు.

అసలు విషయం ఏంటంటే. లైసెన్స్ లేకుండా బైక్ నడపడం నేరం. ధనుష్ కొడుకు ఇప్పుడు అదే నేరం చేశాడు. యాత్ర వయసు ఇంకా 17 ఏళ్ళు మాత్రమే. ద్విచక్ర వాహనం నడపడానికి 18 ఏళ్ళు నిండి లైసెన్స్ పొందాలి. నిబంధనలు ఉల్లంఘించిన అతనికి పోలీసులు జరిమానా విధించారు. బైక్ నడుపుతున్న సమయంలో యాత్ర హెల్మెట్ ధరించలేదు. ఈ వైరల్ వీడియో చూసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

🎥 యాత్ర చట్టాన్ని ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో వెయ్యి రూపాయల జరిమానా విధించారు. 2004లో రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో ధనుష్ వివాహం జరిగింది. వీరికి యాత్రరాజు, లింగరాజు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఐశ్వర్య, ధనుష్ 2022లో విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ తమిళ చిత్ర పరిశ్రమలో బిజీగా ఉన్నారు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె దర్శకత్వం వహించిన ‘లాల్ సలామ్’ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. అటు ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నారు ధనుష్ .


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page