top of page
Suresh D

యాదగిరిగుట్ట వివాదంపై స్పందించిన భట్టి విక్రమార్క..🤔

యాదగిరిగుట్టలో కింద కూర్చున్నారంటూ జరిగిన ట్రోల్ అంశంపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. తాను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నాను అని భట్టి తేల్చి చెప్పారు. ఆ ఫోటోను తీసుకొని కావాలని కొందరు ట్రోల్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థికశాఖామంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నానన్నారు భట్టీ విక్రమార్క. ఎవరికీ తలవంచే వాడిని కాదని… ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని అసలికే కాదన్నారు. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదంటూ యాదాద్రి వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు భట్టీ.



bottom of page