top of page

🗣️🏛️💬అవిశ్వాసంపై లోక్‌సభలో చర్చ.. 🗣️🏛️

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోనే ఎన్డీయే సర్కారుపై కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ చర్చ మొదలైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ చర్చ జరగుతుంది. మొత్తం 16 గంటల పాటు చర్చకు సమయాన్ని స్పీకర్‌ కేటాయించారు.

లోక్‌సభలో పార్టీలకున్న సంఖ్యాబలాన్ని బట్టి ఆయా పార్టీలకు మాట్లాడే సమయాన్ని స్పీకర్‌ కేటాయించారు. సంఖ్యాబలం అధికంగా ఉన్న బీజేపీ సభ్యులకు మాట్లాడేందుకు 6 గంటల 41 నిమిషాల సమయాన్ని స్పీకర్‌ కేటాయించారు. కాంగ్రెస్‌ పార్టీకి గంటా 41 నిమిషాల సమయాన్ని కేటాయించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీలకు కూడా ఈ చర్చలో పాల్గొనే అవకాశం లభించింది. ఏపీ అధికార పార్టీ వైసీపీకి 29 నిమిషాలు బీఆర్ఎస్ పార్టీకి 12 నిమిషాల సమయాన్ని స్పీకర్‌ కేటాయించారు. చర్చ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిస్తారు. 🙏👥

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page