top of page

😴'కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో కరెంట్ షాక్ ఇవ్వాలి'-హరీష్ రావు

💥రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌పై టీపీసీసీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అధికార బీఆర్ఎస్‌తో పాటు సొంత పార్టీలోనూ ఆయన చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు.

ఏనాడు వ్యవసాయాన్ని పట్టించుకోని కాంగ్రెస్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టిందని మంత్రలు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌ తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా.. ఆర్థకశాఖ మంత్రి హరీశ్ రావు కూడా స్పందించారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి ధరణి వద్దు.. రైతు బంధు వద్దు.. ఉచిత కరెంట్ వద్దు అని హరీశ్ ట్వీట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ పార్టీకి కరెంట్ షాక్ ఇవ్వాలన్నారు."రైతన్న సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేసీఆర్ గారి పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాతున్నారు. నాడు తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టిన మనిషే, నేడు పచ్చబడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్నడు. పార్టీ మారినా మనిషి మారలేదు.. మనసు కరగ లేదు. పైశాచికత్వంతో తెలంగాణ సమాజంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడికి రైతులు తగిన శాస్తి చేయాలి. రైతన్నకు కరెంట్ వద్దన్న కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో కరెంట్ షాక్ ఇవ్వాలి." అని మంత్రి హరీష్ ట్వీట్ చేశారు. 🔊

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page