top of page

🥇 శ్రీలంకతో ఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్..

🏏 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పటికే ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. 🏆 కాగా ఇప్పుడు స్వర్ణ పతక పోరులో ఏ జట్టు తలపడుతుందో కూడా ఖరారు అయింది. 🥇

మహిళల క్రికెట్‌ రెండో సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి శ్రీలంక ఫైనల్‌కు టికెట్‌ను ఖాయం చేసుకుంది. 🏏 ఇప్పుడు సోమవారం భారత్-శ్రీలంక మధ్య స్వర్ణ పతక పోరు జరగనుంది. సెమీఫైనల్‌లో పాకిస్థాన్ జట్టు 75 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రీలంక ఈ లక్ష్యాన్ని సులభంగా సాధించింది. ఈ 20 ఓవర్ల మ్యాచ్‌లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. 🇱🇰 పాకిస్థాన్ గురించి మాట్లాడితే, 20 ఓవర్లలో 75 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్తాన్ తరపున షావల్ జుల్ఫికర్ గరిష్టంగా 16 పరుగులు చేసింది. అయితే పాక్ ఆటగాళ్లలో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరును తాకగలిగారు. 🇵🇰 ఇక శ్రీలంక గురించి చెప్పాలంటే 17వ ఓవర్ లోనే గెలిచి పతకాన్ని ఖాయం చేసుకుంది.

🥇 గెలిచినా, ఓడినా పతకం పక్కా.. 🏆 ఇక సోమవారం బంగారు పతకం, కాంస్య పతక పోటీలు జరగాల్సి ఉన్నాయి. 🥇 స్వర్ణ పతక పోరులో భారత్, శ్రీలంక జట్లు తలపడనుండగా, కాంస్య పతక పోరులో బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. 🏆 అంటే ఆసియా క్రీడల్లో క్రికెట్ నుంచి భారత్‌కు పతకం ఖాయమైంది. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి టీమిండియా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంటుందని అంతా భావిస్తున్నారు. 🇮🇳🥈🥉

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page