top of page

🏆 ప్రపంచకప్ ఫైనల్లో తలపడేది ఆ రెండు జట్లే:

🏏 వచ్చే ప్రపంచకప్‌పై టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ భారీ జోస్యం చెప్పుకొచ్చాడు. 🇮🇳 ప్రపంచకప్ 2023లో ఏ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆడవచ్చో చెప్పేశాడు. 🏆

శ్రీశాంత్ ప్రకారం, ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగవచ్చని ప్రకటించాడు. 🤩 ఎస్ శ్రీశాంత్ మాట్లాడుతూ.. ఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతుందని నేను నమ్ముతున్నాను. 🌟 2019 ప్రపంచకప్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు శ్రీలంకను 50 పరుగులకు ఆలౌట్ చేసినట్లే ఈ మ్యాచ్‌లతోనూ జరుగుతుందని అనుకుంటున్నాను. 🏏 నేను చాలా సానుకూలంగా ఉన్నాను. భారతీయ అభిమానిని కాబట్టి ప్రతి ఒక్కరూ భారతదేశ విజయం గురించే ఆలోచిస్తారు’ అని తెలిపాడు.

🇦🇺 ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. భారత క్రికెట్ జట్టు తన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లను 9 వేర్వేరు నగరాల్లో ఆడనున్న సంగతి తెలిసిందే. 🏟️ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో చెన్నైలో, రెండో మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో, మూడో మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరగనుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో అక్టోబర్ 19న పూణె మైదానంలో, ఐదో మ్యాచ్ న్యూజిలాండ్‌తో అక్టోబర్ 22న ధర్మశాలలోని అందమైన మైదానంలో జరగనుంది. 🌏🏏

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page