top of page

కోహ్లీ బాటలోనే జడేజా..మిగతా టెస్టులకు కూడా..🏏🇮🇳

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్టుకు మూడో టెస్టుకు చాలా గ్యాప్‌ ఉంది. అందుకే మూడో టెస్టు నాటికి రాహుల్, జడేజా, కోహ్లిలు జట్టులోకి వస్తారని బీసీసీఐ భావించింది.

కానీ ఇప్పుడు క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, రవీంద్ర జడేజా గాయం నయం కావడానికి 4 నుండి 8 వారాలు పడుతుందని తెలసిఇంది . అంటే జడేజా రెండో టెస్టుతో పాటు మూడో టెస్టుకు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని తర్వాత ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో జరిగే నాలుగో టెస్టుకు జడేజా ఫిట్‌గా ఉంటాడని భావిస్తున్నారు. ప్రస్తుతం బీసీసీఐ ఇచ్చిన అప్‌డేట్‌లో రవీంద్ర జడేజా రెండో టెస్టుకు మాత్రమే దూరమైనట్లు సమాచారం. ఇక విరాట్ కోహ్లీ గురించి ఇంకా ఎటువంటి అప్‌డేట్ లేదు.

విరాట్ పై నో క్లారిటీ.. 😟

వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. అతని అందుబాటులో లేకపోవడంపై బీసీసీఐ పత్రికా ప్రకటన విడుదల చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ మొదటి రెండు టెస్టులు ఆడడం లేదని మాత్రమే తెలిపింది. అలాగే మూడో మ్యాచ్‌లో విరాట్ ఆడతాడా లేదా అనే విషయంపై ఇంకా సమాచారం లేదు. ఆ మధ్య విరాట్ తల్లికి ఆరోగ్యం బాగోలేదని పుకార్లు వచ్చాయి. అయితే ఈ పుకార్లను కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ కొట్టిపారేశాడు. 🙏✨


bottom of page