top of page

🏏🎉 అయోధ్యలో విరాట్‌ కోహ్లీ డూప్‌..🎊

🏛 అయోధ్య బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సోమవారం (జనవరి 22) న జరిగిన ఈ చారిత్రాత్మక ఘట్టాన్నికళ్లారా వీక్షించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.

అందుకు తగ్గట్టుగానే సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రెటీలు తమ భాగస్వాములతో ఈ మహా క్రతువుకు హాజరయ్యారు. అయితే ఆహ్వానం అందినా కూడా కొంతమంది ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు. అందులో విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు కూడా ఉన్నారు. అయితే అచ్చంగా కోహ్లీలాగే ఉండే ఒక వ్యక్తి అయోధ్యలో సందడి చేశాడు. టీమిండియా జెర్సీ ధరించి అభిమానులతో ముచ్చటించాడు. అతను కోహ్లీ డూప్ అని తెలిసినా చుట్టుముట్టి ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడం విశేషం. మొదట చాలా సరదాగా సాగిన ఈ తతంగం ఆ కాసేపటికే తోపులాట దాకా వెళ్ళింది. దీంతో కోహ్లీ డూప్‌ సైతం బెదిరపోయాడు. చుట్టూఉన్న జనంలోంచి అతి కష్టమ్మీద ఎలాగోలా బయట పడ్డాడు. ఆపై వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కోహ్లీకే కాదు, అతని డూప్‌కు కూడా అభిమానుల బెడద తప్పడం లేదంటూ నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. 🤩🏟

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page