top of page

🏏 టీ20ల్లో తొలి ప్లేయర్‌గా రోహిత్ సరికొత్త చరిత్ర 🌪️

👨‍✈️ కెప్టెన్ రోహిత్ శర్మ తుఫాన్ సెంచరీతో టీ-20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌కు 213 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.

🏟️ బెంగళూరులో ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం ఐదు టీ20 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.

🏏 నాలుగు అంతర్జాతీయ సెంచరీలు చేసిన సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ మాక్స్‌వెల్‌ల కంటే రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు.

📆 జనవరి 2019 తర్వాత రోహిత్ శర్మ మొత్తం T20 క్రికెట్‌లో మొదటి సెంచరీ చేయడం గమనార్హం.

👨‍✈️ కెప్టెన్ రోహిత్ శర్మ 69 బంతుల్లో 121 పరుగులతో సెంచరీ సాధించాడు. టీ20లో 5వ సెంచరీ సాధించాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్‌తో పాటు రింకూ సింగ్ 39 బంతుల్లో 69 పరుగులు చేశాడు. 🏏

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page