top of page

టాస్ గెలిచిన ఆసీస్.. ఇరుజట్ల ప్లేయింగ్ 11లో భారీ మార్పులు.. ఎందుకంటే? 🏏🤔

భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో మూడో మ్యాచ్ మొదలైంది.

ఈ క్రమంలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమైంది. ముఖేష్ కుమార్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాలో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. ట్రావిస్ హెడ్, కేన్ రిచర్డ్‌సన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌లు వచ్చారు. 🇮🇳🇦🇺

కాగా, ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 2-0తో ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ గెలిచే ఉద్దేశ్యంతో నేడు టీమ్ ఇండియా బరిలోకి దిగనుంది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధిస్తే ఆస్ట్రేలియాతో వరుసగా మూడో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఆస్ట్రేలియాతో చివరిగా ఆడిన రెండు సిరీస్‌లను (2020, 2022) భారత జట్టు గెలుచుకుంది. 🏆🔥

Yorumlar


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page