top of page

ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు వచ్చాయా? ఏం జరిగింది? 70 మంది ఏపీ ప్రయాణికులు..

ప్రస్తుత ప్రమాదాన్ని దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటిగా భావిస్తున్నారు. నాలుగు దశాబ్దాల కిందట హార్‌లోని సహస్ర వద్ద ఓ ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పి భాగమతి నదిలో మునిగిపోయింది. ఈ ఘటనలో 500 మంది వరకు మరణించారు. ఇదే అత్యంత ఘోరమైన ఘటన. కాగా, ప్రస్తుత ప్రమాదంలో 230 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ప్రమాదానికి కారణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఒడిశాలో బాలేశ్వర్ సమీపంలోని బహనగా వద్ద శుక్రవారం రాత్రి రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఒక గూడ్సు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇప్పటి వరకూ 233 మంది మృతిచెందారు. మరో 900 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం రాత్రివేళ జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సహా రైల్వే సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. భారతీయ రైల్వే చరిత్రలోనే దీనిని అత్యంత విషాదకర ఘటనగా అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ప్రమాదం ఏలా జరిగిందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు వచ్చినట్టు సమాచారం. దీంతో అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్టు భావిస్తున్నారు. ఆధునిక సాంకేతిక అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ ప్రమాదం జరగడం బాధాకరం.

బెంగళూరు నుంచి బెంగాల్‌లోని హౌరాకు వెళ్తున్న యశ్వంత్‌పూర్ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7.20 గంటల సమయంలో పట్టాలు తప్పింది. దీంతో ఆ రైలుకు చెందిన పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. ఇంతలోనే ఆ మార్గంలో వస్తోన్న షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆ బోగీలను ఢీకొట్టింది. దాంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు పట్టాలుతప్పి బోల్తాపడ్డాయి. అదే సమయంలో కోరమండల్‌ బోగీలు పక్కనున్న ట్రాక్‌పై గూడ్సు రైలు దూసుకొచ్చింది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. ఇక, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో దాదాపు 70 మంది వరకూ ఏపీ ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా హౌరా, బాలేశ్వర్ వంటి స్టేషన్‌లో ఈ రైలును ఎక్కినట్టు సమాచారం. వీరంతా ఏపీలోని విజయనగరం, విశాఖ, రాజమండ్రి స్టేషన్‌లలో దిగాల్సి ఉంది. మరోవైపు, రైలు ప్రమాదానికి సంబంధించిన వివరాలు అందించేందుకు ఒడిశా, పశ్చిమ్ బెంగాల్‌ ప్రభుత్వాలు, రైల్వే శాఖ హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటుచేశాయి. ఈ రైళ్లలో తెలుగువారు ఎవరైనా ఉంటే వారి ఆచూకీ కోసం విశాఖపట్నం, విజయనగరం స్టేషన్లలో సంప్రదించేందుకు అధికారులు హెల్ప్‌లైన్‌ నంబర్లను ప్రకటించారు. ఒడిశా హెల్ప్‌లైన్ నంబర్‌ : విశాఖపట్నం : 0891-2746330, 0891-2744619

విజయనగరం : 0892-2221202, 0892-2221206 శ్రీకాకుళం : 0894-2286213, 0894-2286245 ఒడిశా హెల్ప్‌లైన్ నంబర్‌ : 06782262286 హౌరా : 033-26382217 బాలాసోర్‌ : 8249591559 చెన్నై : 044-25330952 పశ్చిమబెంగాల్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లు:033-22143526, 033-22535185 Telugu News App : ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం Mediafx.co ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page